ప్రతీకారేచ్ఛతో జగన్‌ రగిలిపోతున్నారు: చంద్రబాబు

Update: 2020-06-13 04:34 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. చంద్రబాబు వ్యాఖ్యలు యధావిధిగా.. ప్రతీకారేచ్ఛతో జగన్ రగలిపోతున్నాడు. ప్రజా సమస్యలపై టిడిపి పోరాడటాన్ని సహించలేక పోతున్నాడు. ఏడాది వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే, టిడిపి నేతలపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ లు. నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్, నేడు జెసి ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ జగన్ కక్ష సాధింపు చర్యలే. దురుద్దేశ పూర్వకంగానే టిడిపి నేతల అరెస్ట్ లు. కావాలనే కక్షగట్టి ఇదంతా చేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. తాను జైలుకు వెళ్లానన్న అక్కసుతో ఇతరులను జైళ్లకు పంపాలన్న కక్ష పెంచుకున్నాడు.

ప్రతీకారేచ్ఛతో రాష్ట్రాన్ని జగన్ పతనం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలతో తెలుగుదేశం పార్టీని ప్రజలనుంచి దూరం చేయలేరు. రెట్టించిన బలంతో ప్రజా సమస్యలపై పోరాడతాం. అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటాం. వైసిపి ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడతాం. ప్రజల అండదండలే టిడిపి నేతలకు ఆశీస్సులు. జగన్ కక్ష సాధింపు చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలి. వైసిపి దుశ్చర్యలను ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు, అన్నివర్గాల ప్రజలు ఖండించాలి అని చంద్రబాబు తెలిపారు. 

Tags:    

Similar News