తన తాతగారు పీవీజీ రాజు గారిలాగే తాను కూడా ప్రజలకు కస్టోడియన్ లా ఉంటానంటున్నారు సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు, సేవ చేయడానికి వయసుతో సంబంధం లేదని, ఆమె అంటున్నారు తనను ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలను కొట్టి పారేసిన సంచయిత, తానేం సేవ చేశానో ఈప్రాంత ప్రజలకు బాగా తెలుసునన్నారు. తనపై వస్తున్న విమర్శలకు తన పనితనమే గీటురాయి అన్నారు సంచయిత.