ఏపీకి కొత్తగా ఐదుగురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2018 బ్యాచ్ కు చెందిన ఐదుగురు అధికారులను ఏపీకి కేటాయించారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఐదుగురు ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. ఒకరు బీహార్, ఒకరు ఢిల్లీ, మరొకరు రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారు. ఆ ఐదుగురిని ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయించారు. వీరిని ఏ స్థాయిలో నియమిస్తారన్నది ఇంకా తెలియరాలేదు.
కేవీ మహేశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్
కొమ్మి ప్రతాప్ శివకిశోర్, ఆంధ్రప్రదేశ్
షఫ్కత్ అమ్నా, బీహార్
సునీల్ షెరాన్, ఢిల్లీ
రాహుల్ మీనా, రాజస్తాన్