టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌పై చోరీ కేసు

Update: 2019-06-21 10:00 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌పై చోరీ కేసు నమోదైంది. పోలవరం పైపులను చింతమనేని దొంగిలించారంటూ రైతులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసన సత్యనారాయణ అనే రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు చింతమనేని ప్రభాకర్‌తోపాటు మరో ఐదుగురిపై 420, 348, 431, రెడ్ విత్ 34, పీడీయాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసుపై వివరణ ఇచ్చేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చింతమనేని వచ్చారు. తాను పైపులు సొంత ఖర్చుతో కొన్నానని చెబుతుంటే బాధిత రైతులు మాత్రం ఎకరాకు వెయ్యి చొప్పున చెల్లించామంటున్నారు. 

Tags:    

Similar News