Andhra Pradesh: ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం

Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే ఆమంచి పీఏ రాంబాబుపై దుండగుల దాడి * కత్తులు, రాడ్లతో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Update: 2021-03-07 04:15 GMT

Representational Image

Andhra Pradesh: ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం చోటుచేసుకుంది. లక్ష్మీ థియేటర్‌ సమీపంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పీఏ రాంబాబుపై గుర్తుతెలియని వ్యక్తులు రాడ్లు, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన రాంబాబును మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని పరామర్శించిన ఆమంచి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News