కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ దగ్గర 8 నెలల బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. రాజస్థాన్కు చెందిన రెండు కుటుంబాల మధ్య 35 వేల అప్పు వివాదంలో కిడ్నాప్ జరిగింది. రాజస్థాన్కు చెందిన పులూభాయ్ కుటుంబం పొట్టిపాడు టోల్గేట్ దగ్గర ఫుట్పాత్ వ్యాపారం చేస్తోంది. అవసరాల కోసం అక్కడే ఉంటున్న మరో రాజస్థాన్ కుటుంబం ఛానూ, మాయ దగ్గర 35 వేల అప్పు తీసుకున్నాడు. అయితే బాకీ తీర్చే విషయంలో 4 రోజుల క్రితం రెండు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. ఇవాళ ఛానూ, మాయా దంపతులు పులూభాయ్ కుమారుడు అంకీస్ను అపహరించుకుని రాజస్థాన్కు వెళ్లిపోయారు. దీంతో అంకీస్ తండ్రి ఆత్కూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ జరుపుతున్న పోలీసులు ఓ పోలీసు బృందాన్ని రాజస్థాన్కు పంపినట్లు వివరించారు.