నాడు సీబీఐ వద్దన్నారు.. ఇప్పుడెందుకు మాట మార్చారు..?: బాబుపై బొత్స ఫైర్

Update: 2019-09-19 14:13 GMT

అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై మంత్రి బొత్స నిప్పులు చెరిగారు. పనికిమాలిన వ్యవస్థ అంటూ నిందించిన చంద్రబాబు ఇప్పుడు అదే గవర్నర్‌ను ఏ ముఖం పెట్టుకుని కలిశారని ప్రశ్నించారు. ఇక సీబీఐని ఏపీ పొలిమేరకు కూడా రావొద్దన్న బాబు ఇప్పుడు సీబీఐ విచారణకు ఎలా డిమాండ్ చేస్తారని నిలదీశారు. కోడెల మృతిపై రాజకీయంచేసి లబ్దిపొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని బొత్స మండిపడ్డారు. 

Tags:    

Similar News