ఉండవల్లిలో చంద్రబాబుది సొంత ఇల్లు కాదు: బొత్స

Update: 2019-06-28 16:00 GMT

అమరావతిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇంటికి నోటీసులు జారీ నేపథ్యంలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఉండవల్లిలో చంద్రబాబుది సొంత ఇల్లు కాదని.. లింగమనేని రమేశ్‌ భూమిలో శాశ్వత నిర్మాణాలు చేయకూడదనే నిబంధన ఉందన్నారు. న్యాయస్థానాలు ఏం చెప్పాయో తెలుసుకదా అని బొత్స వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి ఎవరిమీదా వ్యక్తిగత కక్షలు లేవని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలు నిర్మించిన ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇస్తామని తెలిపారు. అది మాజీ సీఎం అయినా సామాన్యుడైనా ఒకటేనన్నారు. 

Tags:    

Similar News