ప్రజల్ని మభ్యపెట్టేందుకే ప్రజా చైతన్య యాత్ర

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం 'జగనన్న వసతి దీవెన' సీఎం జగన్‌ విజయనగరం జిల్లా నుంచి ప్రారంభిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Update: 2020-02-20 12:19 GMT
అనని మాటలను అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు : మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం 'జగనన్న వసతి దీవెన' సీఎం జగన్‌ విజయనగరం జిల్లా నుంచి ప్రారంభిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో జిల్లాకు పరిశ్రమలు రాలేదని అన్నారు. యువతకు ఉపాది కల్పించడంలో విఫలమైయ్యారని విమర్శించారు. పరిశ్రమలు ఎలా తీసుకురావాలో, యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో వైసీపీ ప్రభుత్వానికి తెలుసని పేర్కొన్నారు.

ప్రజాచైతన్య యాత్రతో చంద్రబాబు ప్రజలను మధ్యపెట్టే ప్రయత్నం చేస్తు్న్నారని బొత్స విమర్శించారు. ఈ నెల 24న పర్యటన సీఎం జిల్లాలో పర్యటిస్తారని వెల్లడించారు. ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణితో కలిసి మంత్రి బొత్స సమీక్షించారు. సీఎం పర్యటించే ప్రాంతాలను సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం దిశా పోలీస్‌ స్టేషన్‌ను సీఎం జగన్‌ ప్రారంభిస్తారని మంత్రి పేర్కొన్నారు.  

Tags:    

Similar News