ప్రజా వేదిక విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చట్ట ప్రకారమే ప్రజా వేధికను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతిపక్షం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్న ఆయన గతంలో ప్రతిపక్షం పట్ల ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలుసన్నారు. ఇక ప్రజా వేధిక టీడీపీ నేతల సొంత ఆస్తి కాదన్నారు.