కాపు నాయకులు టీడీపీని వీడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదన్నారు ఆ పార్టీ నేత బొండా ఉమ. ఇప్పటివరకు జరిగిన రెండు మీటింగ్ లు చంద్రబాబుకు సమాచారం ఇచ్చే నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ పటిష్టతను, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలన్న అంశంపైనే ఈ సమావేశంలో తాము చర్చించామని బొండా ఉమ చెప్పారు. టీడీపీ నేతలు కలిసినప్పుడే వైసీపీ నాయకులు కూడా డీజీపీని కలవడం దారుణమన్నారు.