Tirupati: ఎస్వీయూలో నాటు బాంబు పేలుడు కలకలం

Tirupati: హెచ్‌ బ్లాక్‌ సమీపంలో రెండు నాటు బాంబులు పేలిన ఘటనలో శునకం, వరాహం మృతి చెందాయి

Update: 2021-04-01 05:45 GMT

నాటు బాంబు పేలుడు (ఫైల్ ఇమేజ్)

Tirupati: తిరుపతి ఎస్వీయూలో నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. హెచ్‌ బ్లాక్‌ సమీపంలో రెండు నాటు బాంబులు పేలిన ఘటనలో శునకం, వరాహం మృతి చెందాయి. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు హెచ్‌బ్లాక్‌ వద్ద పేలాయి నాటుబాంబులు. ఉదయం 7.30 గంటలకు హెచ్‌ బ్లాక్‌ నుంచి పద్మావతి కొవిడ్ సెంటర్‌కు వెళ్లే మార్గంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్‌లో మరో మూడు ప్రాంతాల్లో నాటు బాంబులు ఉన్నట్లు సమాచారం.

Full View


Tags:    

Similar News