శ్రీవారి ఆలయంలోని పోటులో పేలిన బాయిలర్‌

తిరుమల శ్రీవారి ఆలయంలోని పోటులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో ప్రమాదవశాత్తు బాయిలర్‌ పేలింది. పులిహోర ప్రసాదం కోసం చింతపండు రసం వేడి చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Update: 2020-10-24 11:31 GMT

తిరుమల శ్రీవారి ఆలయంలోని పోటులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో ప్రమాదవశాత్తు బాయిలర్‌ పేలింది. పులిహోర ప్రసాదం కోసం చింతపండు రసం వేడి చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఐదుగురు కార్మికుల గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అటు సమాచారం అందడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు.

Tags:    

Similar News