తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. బోటు ఎక్కడుందో తెలిసినా బోటును బయటికి తీయలేని పరిస్థితి నెలకొంది. లంగరుకు బోటు తగిలినా లాగలేకపోయారు. బోటు బురదలో కూరుకుపోవడంతో వెలికితీయడం కష్టంగా మారుతోంది. బోటు లంగరుకు తగులుకోగానే వదిలేస్తుండటంతో ధర్మాడి సత్యం మెరైన్ డీప్ వాటర్ డ్రైవర్స్ కోసం విశాఖ వెళ్లాడు. డీప్ డ్రైవర్స్ వచ్చి బోటు అడుగున ఇంజన్కు లంగరు తగిలిస్తే తప్ప బోటు బయటకు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.