గుంటూరు జిల్లా తాడేపల్లిలో భారీ పేలుడు సంభవించింది. సీఎం జగన్ ఇంటికి కిలో మీటరు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కృష్ణానగర్లో సంభవించిన ఈ పేలుడికి ఓ ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 18ఏళ్ల యువతికి తీవ్ర గాయాలయ్యాయి. కంటి చూపును కోల్పోయింది. యువతిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు.