విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ మళ్లీ రెచ్చిపోయింది. కృష్ణలంకలో అన్నదమ్ములపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేసింది. తీవ్ర గాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించారు. రెండో రోజుల క్రితం నెహ్రు నగర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణలంకలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే ట్రాక్, పుష్కర ఘాట్ లు బ్లేడ్ బ్యాచ్ లకు అడ్డాలుగా మారాయి. బ్లేడ్ బ్యాచ్ ల ఆగడాలకు భయపడి ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు.