Andhra Pradesh: చిన్నాయగూడెం గ్రామంలో చేత బడి కలకలం

Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలో చేత బడి కలకలం రేగింది.

Update: 2021-03-03 02:26 GMT

ఫైల్ Image

Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలో చేత బడి కలకలం రేగింది. గ్రామ పొలిమేరలో గల గంగానమ్మ గుడి వద్ద, గ్రామ వీధుల్లో ఓ మహిళ, ఓ పురుషుడు ఎరుపు రంగు నీరు, పసుపు చల్లుతున్నారు. వీరు చేతబడి చేస్తున్నారు అని గ్రామస్తులు భయపడి ఆ ఇద్దరిని గ్రామస్తులు నిర్బంధించారు. గంగానమ్మ తల్లి ఆగ్రహించింది అని కొందరు గ్రామస్తులు చెప్పగా, గంగానమ్మ గుడి వద్ద గ్రామస్తులు శాంతి పూజలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ..ఆ మహిళను, పురుషుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

Tags:    

Similar News