టీడీపీకి షాక్ ఇస్తున్న బీజేపీ..31 మంది తాజా మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని ప్రచారం

Update: 2019-06-21 12:53 GMT

ఏపీలో టీడీపీని కోలుకోని విధంగా దెబ్బతీస్తోంది బీజేపీ. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకున్న బీజేపీ అధిష్టానం. ఏపీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరిని తమపైపు లాగేందుకు రెడీ అవుతోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, బీజేపీ కార్యదర్శి సత్యకుమార్‌ ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. నేతల పరపతి, స్థాయిని బట్టి ప్రాధాన్యతను బట్టి కేంద్రంలో పదవులు, నామినేటెడ్ పోస్టులతోపాటు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీపై ఆసక్తి ఉన్నా నేతలు కచ్చితమైన హామీలు కోరుతున్నట్టు తెలుస్తోంది. సామూహికంగా పార్టీలో చేరేందుకు కొందరు అంగీకరించనట్టు తెలుస్తోంది. వచ్చే నెల 5న కొందరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 31 మంది తాజా మాజీలు చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News