ఏపీ ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పాలనపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఘాటు విమర్శలు చేశారు. ఏపీకి జీవనాడి వంటి పోలవరాన్ని స్థంభింపచేశారని సుజనా మండిపడ్డారు. రాజధాని అమరావతి బోసిపోయిన నగరంగా మారిందని సుజనా ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి తావులేని ఇసుక విధానం తీసుకువస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని సుజనా గుర్తుచేశారు. కొత్త విధానం రాకముందే పాత విధానాన్నిరద్దు చేయడం ఏంటని మండిపడ్డారు.