గంటా బీజేపీని సంప్రదించారు.. త్వరలో టీడీపీ ఖాళీ : సోము వీర్రాజు సంచలనం

Update: 2019-11-13 06:44 GMT

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీని సంప్రదించారని.. త్వరలో చాలా మంది నేతలు బీజేపీలోకి వస్తారని.. అతిత్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని తెలిపారు.శాసనసభలో తమ ప్రాతినిధ్యం తప్పకుండా ఉంటుందన్న వీర్రాజు.. ఆ 23 మందిని కలుపుకుంటామన్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలతో టీడీపీకి టెన్షన్ పట్టుకున్నట్టయింది.

గంటా తోపాటు ఇంకెంతమంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడి బీజేపీలో చేరతారో అని అప్రమత్తమైంది. ఇప్పటికే సీనియర్లను రంగంలోకి దింపింది. ఏ ఏ నేతలు పార్టీని వీడాలనుకుంటున్నారో వివరాలు సేకరించింది. వారిని బుజ్జగించే బాధ్యతను చేపట్టింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు వ్యాఖ్యలతో మరింత దూకుడు పెంచింది.

Tags:    

Similar News