తిరుమల బస్సు టికెట్ అన్యమత ప్రచారంపై మండిపడ్డ రాజాసింగ్

Update: 2019-08-23 07:55 GMT

తిరుమల బస్సు టికెట్‌ అన్యమత ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వాటిని ఎవరు చేస్తున్నారు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. బస్‌ టికెట్లపై జెరూసలెం, హజ్‌యాత్ర లకు సబంధించి సమాచారం ముద్రించడం వెనుక హిందూమతాన్ని అణిచివేయాలనే కుట్ర కనిపిస్తుందన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని బాధ్యులను శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు రాజాసింగ్‌.

Tags:    

Similar News