ఏపీ రాజధాని అమరావతిని మార్చాలని చూస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని... బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో అవకతవకలు జరిగాయని అనుమానాలు ఉంటే, వాటిని విచారణ జరపాలని సూచించారు. అమరావతి మీద బొత్స సత్యనారాయణ ఒకటి మాట్లాడితే. అవంతి శ్రీనివాస్ మరొకటి మాట్లాడుతున్నారని.. ఎంపీ విజయసాయిరెడ్డి ఇంకొకటి చెబుతున్నారని.. ఆ ముగ్గురి మాటలకు మధ్య పొంతన లేదన్నారు.. అందరూ కలసి ప్రజల్ని గందరగోళ పరుస్తున్నారంటూ విమర్శించారు.. మరోవైపు కృష్ణా వరదను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలయం అయ్యిందటూ ఆయన విమర్శించారు..