ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్దపార్టీగా అవతరించింది-రాంమాధవ్

Update: 2019-07-14 10:55 GMT

బీజేపీకి అధికారం పరమావధికాదు.. దేశ ప్రజల కోసమే అధికారం అనేది పార్టీ భావన అన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. గుంటూరులో నిర్వహించిన పదాదికారుల సమావేశంలో రాంమాధవ్ పాల్గొన్నారు. రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ప్రారంభమై ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్ బీజేపీతోనే ఉంటుందన్నారు. తెలంగాణకు దీటుగా ఏపీలోనూ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఏపీలో రాజకీయ శూన్యత ఉందని.. 2024 నాటికి బీజేపీ అధికార పార్టీ దిశగా ఎదగాలని పిలుపునిచ్చారు.  

Tags:    

Similar News