వైసీపీపై బీజేపీ నేత రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వళ్ల రాష్ట్రానికి మేలు కన్నా కీడే ఎక్కువగా ఉందని రామాంధవ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన. ఏపీ ప్రజలు పెనం మీద నుంచి పొయ్యలో పడినట్లుగా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉందని తెలిపారు. ఏపీ ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.