రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటినా ఏ విషయం మీద క్లారటీ లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. రాజధాని అంశంతో పాటు పోలవరం, పవర్ సపెక్టార్లో పీపీఏ విధానాల పైన ముందు నుంచి బీజేపీ ఒకే విధానాన్ని చెబుతోందన్నారు. ప్రభుత్వం పోలవరం, రాజధాని విషయంలో పునరాలోచించాలని పురందేశ్వరి సూచించారు.