వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీదే అధికారం : కవిత

Update: 2019-08-14 07:00 GMT

ఆంధ్రప్రదేశ్: టీడీపీపై సంచలన వాఖ్యలు చేసి బీజేపీలో చేరిన సినీ నటి కవిత మళ్ళీ తన మాటలకూ పదును పెట్టారు .. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరియు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రెండు దొందూ దొందేనని ఆరోపించారు . మండపేట పట్టణ వైశ్య నేత కాళ్లకూరి నాగబాబు ఇంటికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత ఈ వాఖ్యలు చేసారు . వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ఆమె జోస్యం చెప్పారు . నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె అన్నారు . ఇక రాష్ట్రప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క పధకాలని కాపీ కొట్టి పేర్లు మర్చి పబ్బం గడుపుకుంటున్నాయని ఆమె ఆరోపించారు . 

Tags:    

Similar News