వరద బాధితులను పరామర్శించిన కన్నా
గుంటూరు జిల్లా రేపల్లె మండలం వరద బాధిత ప్రాంతాలలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు.
గుంటూరు జిల్లా రేపల్లె మండలం వరద బాధిత ప్రాంతాలలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. లోతట్టు ప్రాంతాలైన పెనుముడి పల్లెపాలెం వరదకు గురైన ప్రాంతాలను కన్నా సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను సదుపాయలు సరిగా ఉన్నయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ సాయం ఖచ్చితంగా ఉంటుందని కన్నా అన్నారు.