రెండు పార్టీలతో రాష్ట్రం నిండా మునుగుతోంది: కన్నా
సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు తీరుపై ట్విట్టర్లో మండిపడ్డారు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ.
సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు తీరుపై ట్విట్టర్లో మండిపడ్డారు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ. రాష్ట్రాన్ని వరదలు వణికిస్తుంటే సీఎం జగన్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ఒకరు బిబీబిజీగా గడుపుతుంటే మరోకరు ఇల్లు మునిగిందని హైదరాబాద్కు జారుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల వల్ల రాష్ట్రం నిండమునుగుతోందని ఫైరయ్యారు.
రాష్ట్రంలో వరదల సమయంలో
— Kanna Lakshmi Narayana (@klnbjp) August 17, 2019
ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం అమెరికా వెళ్లారు.
5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాయన 'కొంప మునిగి' హైదరాబాద్ జారుకున్నాడు..
వారిద్దరి 'తోక నేతలు'చేస్తున్న చర్చ"ఇల్లు మునిగిందా,లేదా"?
ఇల్లు సంగతి వదిలేయండి మీ రెండు పార్టీల వలన రాష్ట్రం నిండా మునుగుతోంది. pic.twitter.com/cx2Gufcsat