డెబ్బై రోజుల పరిపాలనలో ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ తగ్గిపోయిందన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాను ఎన్ని సార్లు సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని వాపోయారు. ప్రజావేదికను ఒక్క రోజులో కూల్చిన ప్రభుత్వం.. ఇసుక పాలసీని అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తుందని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. .