ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్ ఆయన చేత రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీజే, సీఎం జగన్ తేనీటి విందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గవర్నర్కు అతిథులను పరిచయం చేయనున్నారు.