కర్నూలు జిల్లాలో అరటి ధరలు పతనం
* కిలో అరటి రెండు రూపాయలు * గిట్టుబాటు లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు * కూలీ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన
కర్నూలు జిల్లాలో అరటి ధరలు పతనం అయ్యాయి. కిలో అరటి రెండు రూపాయలు పలుకుతోంది. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. చాగలమర్రి మండలం చిన్న వంగలిలో రైతు చంద్ర ఓబుళరెడ్డి..
అరటి గెలలను మూగ జీవాలకు వదిలేశాడు. లక్షల రూపాయలు పెట్టుబడుటు పెడితే... కనీసం కూలీల డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.