తిరుపతి శ్రీ వేంకటేశ్వర జూ పార్క్లో ఓ తెల్ల పులి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఆసియాలో అరుదుగా కనిపించే తెల్ల పులులు శేషాచలంలో మనగలుగుతున్నాయి. చాలా సంవత్సరాల క్రితం రెండు తెల్ల పులులు ఎస్వీ జూకు తరలించారు. వాటిలో సమీర్, రాణిలకు ఐదు పులి పిల్లలు జన్మించాయి. అందులో మూడు మగ పులులు, రెండు ఆడ పులులున్నాయి. పుట్టిన పులి పిల్లల్లో ఒక మగ పులి పిల్లకు జగన్ అని... మరో ఆడ పులి పిల్లకు విజయ అని అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నామకరణం చేశారు. వీటిలో మిగిలిన రెండు మగ పులి పిల్లలకు వాసు, సిద్దాన్ అని... ఆడ పులి పిల్లకు దుర్గ అని నామకరణం చేశారు.