హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ

Update: 2020-01-30 07:11 GMT
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ

అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు సొంత నియోజకవర్గంలో స్థానికులు నిరసన తెలిపారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ఆందోళనకు దిగారు. రాయలసీమ ద్రోహి అంటూ సీమలో హైకోర్టును వ్యతిరేకిస్తున్న బాలకృష్ణ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.

అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మాత్రమే ఎందుకు అభివృద్ధి కోరుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కాన్వాయ్‌ను ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. మరోవైపు బాలకృష్టకు మద్దతుగాకాన్వాయ్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకున్నారు.

Tags:    

Similar News