చిత్తూరు జిల్లాలో ఐసోలేషన్లో ఉన్న వ్యక్తులను పరామర్శించేందుకు వెళ్లిన వాలంటీర్లపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. కుప్పం మండలంలోని ఒక గ్రామానికి చెందిన 16 మంది ఇటీవలే మలేసియా నుంచి వచ్చారు. వారంతా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా వారిని పరామర్శించేందుకు వెళ్లిన వలంటీర్లపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.