Andhra Pradesh: ఏపీ బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ నియామకం

Andhra Pradesh: కోర్‌ కమిటీని ప్రకటించిన జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్

Update: 2021-11-29 16:03 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ నియామకం (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి కోర్ కమిటీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటించారు. ఈ కమిటీలో సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సత్యకుమార్‌ సభ్యులుగా ఉన్నారు. ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ , జీవీఎల్ నరసింహారావులను కూడా సభ్యులుగా నియమించారు. కోర్‌ కమిటీలో మధుకర్, మాధవ్, జయరాజు, చంద్రమౌళి, రేలంగి శ్రీదేవిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా శివప్రకాష్‌‌, మురళీధరణ్, సునీల్‌ దేవధర్‌ను నియమించారు.

Tags:    

Similar News