గుంటూరు జిల్లా నడింపల్లిలో కాల్పుల కలకలం

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి.

Update: 2020-02-22 06:51 GMT
Representational Image

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. రమాదేవి అనే మహిళపై సైనికోద్యోగి బాలాజీ కాల్పులు జరిపాడు. ప్రేమించిన యువతి వివాహానికి ఒప్పుకోలేదన్న కారణంతో.. యువతి తల్లిపై కాల్పులకు తెగబడ్డాడు.

ప్రమాదాన్ని గమనించిన రమాదేవి వెంటనే పక్కకు తప్పుకోవడంతో.. కుడి చెవికి తాకుతూ తూటా దూసుకెళ్లింది. తీవ్ర భయాందోళనకు గురైన మహిళ.. కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బాలాజీ అక్కడి నుంచి పరారయ్యాడు.

Tags:    

Similar News