ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా మరో అడుగు ముందుకు పడింది. దీనిపై నియమించిన ఆంజనేయరెడ్డి కమిటీ తన మధ్యంతర నివేదికను సీఎం జగన్కు అందజేసింది. నివేదికను ముఖ్యమంత్రి జగన్ పరిశీలిస్తున్నారు. రేపు కేబినేట్ సమావేశంలో ఈ నివేదికపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. ఆ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.