ఆన్లైన్లో ఆర్టీసీ సేవలు
విశాఖపట్నం-కాకినాడ సూపర్ లగ్జరీ సర్వీసులకు గురువారం నుంచి ఆన్లైన్లో టిక్కెట్ల సర్వీసులు అందుబాటులో ఉంటాయని విశాఖపట్నం డిపో మేనేజర్ దిల్లీశ్వరరావు తెలిపారు.
మద్దిలపాలెం: విశాఖపట్నం-కాకినాడ సూపర్ లగ్జరీ సర్వీసులకు గురువారం నుంచి ఆన్లైన్లో టిక్కెట్ల సర్వీసులు అందుబాటులో ఉంటాయని విశాఖపట్నం డిపో మేనేజర్ దిల్లీశ్వరరావు తెలిపారు. క్యూ.ఆర్. బార్కోడ్ విధానంలో బస్సులో సీట్లు ఖాళీగా ఉంటే ప్రయాణికులు బస్సు ఎక్కిన తరువాత తమ టిక్కెట్ను క్యూఆర్ బార్కోడ్ను డౌన్లోడ్ చేసుకుని చరవాణి ద్వారా డబ్బులు చెల్లించే వెసులుబాటును అధికారులు కల్పించారు. ఈ అవకాశాన్ని కాకినాడ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ ప్రయాణీకులు సద్వినియోగంచేసుకోవాలని ఆయన కోరారు.