పరీక్ష పత్రాల లీకేజీపై కదిలిన ఏపీపీఎస్సీ

Update: 2019-09-23 04:36 GMT

సచివాలయ పరీక్షల పేపర్ లీకేజీ ఆరోపణలపై ఏపీపీఎస్సీ సమీక్ష నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కార్యదర్శి మౌర్య కమిషన్ సమావేశం ఏర్పాటు చేశారు. సమీక్ష తర్వాత ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ నివేదిక ఇవ్వనుంది. ఏపీ సచివాలయ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 19 లక్షల అభ్యర్ధుల ఆశలపై నీళ్ళు జల్లిన ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలంటున్నారు. మళ్లీ పారదర్శకంగా నిర్వహించి, అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News