ఏపీలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

Update: 2019-11-07 08:18 GMT

ఏపీలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు appsc ప్రకటించింది. గతంలో ప్రకటించిన తేదీల్లో కాకుండా పరీక్షలు డిసెంబర్ 12 మరియు 23 మధ్య జరుగుతాయని తెలిపింది. అభ్యర్థుల అభ్యర్థన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు మధ్య సమయం తక్కువగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు appsc కార్యదర్శి సీతరామంజనేయులు తెలిపారు. కాగా కొత్త తేదీలను నవంబర్ 13 న ప్రకటించనున్నారు.

Tags:    

Similar News