కాల్‌మనీ కేసుల్లో ఎవరున్నా వదిలిపెట్టొద్దు.. ఏపీ సీఎం జగన్

Update: 2019-06-25 07:12 GMT

ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతల అంశంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్‌మనీ అంశంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు ఉంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News