అచ్చెన్నాయుడు నుంచి కూన రవి వరకు అందరి ట్రాక్ తీయాలి: స్పీకర్ తమ్మినేని
తనకు సంబంధం లేని విషయంపై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఏసీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. మాజీ ఎమ్మెల్యే కూన రవి అంశంలో ఉద్యోగులకు ఆయనకు మధ్య జరిగిన వివాదంలో తనను అనవసరంగా లాగుతున్నారన్నారని తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారు విజ్ఞతతో ఆలోచించాలని పేర్కొన్నారు. ఉద్యోగస్తులకి ఆత్మగౌరవం ఉంటుందని, వాళ్ళ విధులు వాళ్ళని నిర్వహించేలా ప్రోత్సహించాలని తెలిపారు. అచ్చెన్నాయుడు నుంచి కూన రవి వరకు అందరి ట్రాక్ తీస్తే ఎవరి భాగోతం ఏంటో అందరికీ తెలుస్తుందని తమ్మినేని తెలిపారు.