ఏపీసీసీ అధ్యక్ష పదవికి పోటీలో ఎందరో..

Update: 2019-11-03 10:55 GMT

ఏపీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ ఉమెన్ చాందీ అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. రేసులో రాష్ట్ర మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, చింతా మోహన్‌, సుంకర పద్మశ్రీ లు పీసీసీ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పీసీసీ రేసులో తాను లేనని పల్లంరాజు ప్రకటించినా, కాపు వర్గం నేతలు కొందరు పల్లంరాజుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు కేఆర్కే నాయుడి పేరును కూడా ప్రతిపాదించారు. దీంతో పల్లంరాజు, కేఆర్కే నాయుడి వర్గాల మధ్య మాటల యుద్ధం పెరిగింది. మొన్నటివరకు పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగిన రఘువీరారెడ్డి తప్పుకున్నారు.ప్రస్తుతం ఆయన ఇంచార్జి పీసీసీగా మాత్రమే కొనసాగుతున్నారు.

Tags:    

Similar News