దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తుంది. ఎవరి నుంచి ఎవరికీ కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి. ఏపీలో ఇప్పటవరకూ 1177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా భయంతో నేతలు కోవిడ్ 19 టెస్టులు చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు.
అయితే తాజాగా ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది తన నివాసానికి వెళ్లి ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు చేయగా.. నెగిటివ్గా తేలిందంటూ ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ హ్యాండిల్లో వెల్లడించారు.