'డ్రోన్‌' ప్రయోగంపై బాబుకు చెప్పాల్సిన అవసరం లేదు: మంత్రి బొత్స

Update: 2019-08-20 10:20 GMT

వరదల నష్ట నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సంక్షోభం వస్తే తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న కుట్ర చంద్రబాబుదని, సంక్షోభం నుంచి ప్రజలని గట్టెక్కించి ఆదుకోవాలన్న తపన తమ ప్రభుత్వానిదన్నారు. గోదావరి, కృష్ణా వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయడంతో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగామని అన్నారు. డ్రోన్ కెమెరా విషయాన్ని‌ ముందుగా చంద్రబాబుకి చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన ఇల్లు‌ మునిగిపోతోందనే అధికారులు డ్రోన్ కెమెరా ఉపయోగించారని బొత్స తెలిపారు.


Tags:    

Similar News