ఏపీలో గత 12 గంటల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. రాత్రి 9గంటల నుంచి ఈరోజు ఉదయం 9గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 217 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అన్ని కేసులు నెగటివ్గా నిర్ధారించబడ్డాయని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 348 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 9కి చేరింది. ఇప్పటివరకు తొమ్మిది మందిని డిశ్చార్జి చేసినట్లు అధికారులు వెల్లడించారు.