పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడని హోంమంత్రి సుచరిత అన్నారు. పవన్ బాధ్యతయుతంగా మాట్లాడాలని సూచించారు. పవన్ ఏ రాజకీయ పార్టీతో ఉన్నారో చెప్పాలన్నారు. తన సీటు కూడా తాను గెలుచుకోలేని పవన్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. దిశ ఘటనపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి మేకతోటి సుచరిత తప్పుబట్టారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు వస్తే నేరాలు కంట్రోల్ అవుతాయా అని ప్రశ్నించారు. ప్రజా నాయకుడిని అని చెప్పుకునే పవన్.. ఇలాగేనా మాట్లాడేదని మండిపడ్డారు. మహిళలంటే పవన్కు ఎంత చులకనో ఆయన వ్యాఖ్యలు బట్టే అర్థమవుతుందని విమర్శించారు.