AP High Court: జంబో టీం నియామక జీఓను సస్పెండ్ చేసిన హైకోర్ట్

* కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ * హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని వ్యాఖ్య

Update: 2021-09-22 14:00 GMT

 ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

High Court: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి జంబో టీం నియామకానికి సంబంధించిన జీఓను హైకోర్టు సస్పెండ్ చేయడం పట్ల హర్షాతిరేఖాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీవారి ఆలయ పాలనను రాజకీయ పునరావాసంగా మార్చేసారని మండి పడ్డ బీజేపీ నేతలు ఈ విజయాన్ని భక్తుల విజయంగా చెబుతున్నారు. తిరుమల స్వామి వారి ఆలయంలో పనికట్టుకుని ఇలాంటి పనులు చేస్తున్న ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంప పెట్టు లాంటిదని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. హైందవ సాంప్రదాయాల జోలికి వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని తెలిపారు.

Tags:    

Similar News