సంచలనం సృష్టించిన గోవుల మృతిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కొత్తూరు గోశాలలో ఏకంగా 105 ఆవులు మృత్యువాత పడ్డాయి. ఇంత పెద్ద సంఖ్యలో గోవులు మృతిచెందడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. దీంతో స్పందించిన మార్కెటింగ్ శాఖమంత్రి మోపీదేవి వెంకటరమణా రావు విచారణకు ఆదేశించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన నివేదిక అందిన తర్వాత బాద్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇకపై ఇతర గోశాలలో ఉన్న గోవుల పరిస్థితులపై తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.