చేనేతలకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. చేనేత కార్మికుల కుటుంబాలకు ఏటా 24 వేల రూపాయల ఆర్ధిక సాయం చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన భేటి అయిన మంత్రి వర్గం చేనేతలకు సాయం చేసే అంశం స్పందించింది. YSR చేనేత నేస్తం పేరుతో చేపట్టే ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 90 వేల మంది చేనేత కుటుంబాలకు ఏటా 24 వేల రూపాయల ఆర్ధిక సాయం చేయనున్నారు. ఏటా డిసెంబర్ 21న బ్యాంకుల నుంచి నేరుగా నగదు జమ చేయనున్నారు.